జుకర్‌తో మాస్క్ కేజ్ ఫైట్… లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా…!

గత కొంతకాలంగా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్‌ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పోరును లైవ్ స్ట్రీమ్ చేస్తామని మస్క్‌ ట్వీట్ చేశాడు. అమెరికా టెక్ దిగజాలు ఎలాన్ మాస్క్, మార్క్ జుకర్ బర్గ్ మధ్య ఫైట్ జరుగుతుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం దీనికి సంబంధించి మస్క్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. “జుకర్, మస్క్ మధ్య జరిగే గొడవ ఎక్స్ లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. దీని ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళతాయి”అని మాస్క్ ట్వీట్ చేశాడు.

దీంతో మరోసారి వీరి మధ్య పోరు గురించి నెట్టింట వైర‌ల్‌గా మారింది. కొన్నాలుగా రాజకీయాలు, కృత్రిమ మేధ (ఏఐ) కు సంబంధించి పలు విషయాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తూ..మస్క్, జుకర్ బర్క్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. గత నెలలో ఇవి తిరస్థాయికి చేరాయి. ఎక్స్ ట్విట్టర్ కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ అని యాప్ ను తీసుకొచ్చింది. దీనిపై మస్క్ విమర్మలు చేశాడు. ఎక్స్‌ను కాపీ కొట్టి థ్రెడ్స్ ను డిజైన్ చేశారని ఆరోపించాడు. ఈ క్రమంలోనే జుకర్ వర్క్ అంటే అతడితో కేజ్ ఫైట్ కు తాను సిద్ధమని తొలుత మస్క్ ఎక్స్ లో చెప్పాడు.

దీనిపై జుకర్ బర్గ్ స్పందిస్తూ ప్లేస్ ఎక్కడో చెప్పు అంటూ సవాల్‌కు సై అన్నాడు. వెగాస్ అక్టాగాన్.. చూసుకుందాం అంటూ బెదిరించాడు. దీంతో వీరిద్దరూ కేజ్ ఫైట్ లో తలపడబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తొలుత ఇది కేవలం ప్రచారం కోసం జరుగుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. కానీ కొద్ది రోజులుగా ఇరువురు ట్రైనింగ్ సెషన్ లో పాల్గొనడం.. శరీరాకృతిని ప్రదరిస్తూ ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తుండడంతో వీరి మధ్య పోరు ఖాయమని కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా మస్క్ ట్వీట్ ఈ ప్రచారానికి బలం చేకూర్చుతుంది. అయితే ఈ ఫైట్ ఎప్పుడు జరుగుతుందో ఇంతవరకు తెలియలేదు.