ముఖేష్ అంబానీ కీలక ప్రకటన…. వినాయక చవితి నుంచి ప్రారంభం…..!!

ముఖేష్ అంబానీ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. దేశంలోనే అత్యంత ధనవంతుడు అయినా ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశాడు. అదేంటంటే.. వినాయక చవితి (సెప్టెంబర్ 19) నుంచి జియో ఎయిర్ ఫైబర్ లాంచ్ చేస్తున్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలియజేశాడు. దేశంలో అందరికీ 5జీ నెట్ వర్క్ అందించడమే లక్ష్యమని చెప్పాడు.

ఇటివల‌ రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందరికీ ఆర్టిఫిషియన్ ఇంటర్‌లో ఏంజెల్స్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవలు అందిస్తామని చెప్పాడు. కొన్నేళ్లు కిందట అందరికీ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తామని చెప్పాం.. ఆ మాట నిలబెట్టుకున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో పురోగతిని గుర్తించేందుకు టాలెంట్ పూల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. తాము ఆత్మనిర్భర్ భారత్‌కి ప్రాధాన్యం ఇస్తున్నామని ముకేశ్ అంబానీ పేర్కొన్నాడు.