అమితాబ్ నే బ‌య‌పెట్టిన క‌మ‌ల్ .. ఇంత‌కి ఆ సినిమా ఏంటో తెలుసా..!

భారతీయ సినిమా చరిత్రలో కమలహాసన్, అమితాబ్ బచ్చన్ ఇద్దరు ఓ లెజెండ్స్ లాంటి హీరోలు.. ఇక ఈ ఇద్దరు ఎవరికీ వారే సాటి.. ఒకరిని మించిన నటుడు మరొకరు.. అలాంటి ఇద్దరు హీరోలు సినిమాలో కలిసి నటించిన సమయంలో.. కమలహాసన్ తో నటించడానికి అమితాబ్ బచ్చన్ భయపడ్డారట.. కమలహాసన్‌తో అసలు సినిమా చేయనని తెగేసి చెప్పేశారట..

ఇక ఇది మీకు వింటుంటే వింతగా ఉంది కదూ.. 80వ దశక‌మంలో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగారు అమితాబ్ బచ్చన్.. అలాంటి ఈ అగ్ర హీరో కమలహాసన్ కి భయపడటం ఏంటి? అనుకుంటున్నారా.. ఇదే విషయాన్ని తమిళ దర్శకుడు భాగ్యరాజ్ గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అమితాబ్ బచ్చన్- కమలహాసన్ కాంబోలో తెలుగు దర్శకుడు తాతనేని రామారావు ఓ సినిమాను చేయాలని భావించారు.. ఆ సినిమా కథ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగి, అతనికి చికిత్స చేసే వైద్యుడు చుట్టూ తిరిగే స్టోరీ.

ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం సిద్ధం కాకముందు.. ముందుగా అమితాబ్ బచ్చన్‌ను సంప్రదిస్తే.. తాను ఈ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.. దీంతో దర్శకుడు స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి ఖబర్దార్ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారు. అంతా రెడీ అయిన తర్వాత అమితాబ్ కు స్టోరీ వివరించారు.. అదేవిధంగా సగభాగం పైగా సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సినిమా మధ్యలో నుంచి అమితాబ్ బయటకు వచ్చేశారు.

ఆ సినిమా పతాక సన్నివేశంలో కమల్ పాత్ర చనిపోతుందట. ఆ పాత్ర చనిపోవడంతోనే కథకు బలం చేకూరుతుందట. కానీ కమల్ పాత్ర చనిపోతే అదే సినిమాకు హైలైట్ అవుతుందని.. చనిపోయే సన్నివేశంలో కమల్ నటన ముందు తాను తేలిపోతానని అమితాబ్ భయపడ్డట్లు భాగ్యరాజ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఓపెన్‌గానే తనతో చెప్పారని.. ఈ సినిమా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందని భావించారని.. డబ్బులు పోయినా పర్వాలేదని, కానీ పేరు పోకూడదని చెప్పారని.. దీంతో ఆ సినిమా తాను చేయలేనని.. కావాలంటే మరో సినిమాకు డేట్లు ఇస్తానని చెప్పి ఆయన తప్పుకున్నారని భాగ్యరాజ్ వెల్లడించారు.

విచిత్రంగా ఆ తర్వాత కమల్ హాసన్ తో కలసి గిర్ఫతార్ సినిమాలో నటించారు. ఇందులో రజనీకాంత్ కూడా నటించారు. అమితాబ్ దక్షిణాది సినిమాల్లో పెద్దగా నటించలేదు. మనం సినిమాలో ఓ చిన్న కామియో రోల్ లో కనిపించారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డిలో నూ నటించారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కె లో నటిస్తున్నారు అమితాబ్ బచ్చన్. అలాగే ఈ సినిమాలో క‌మ‌ల్ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌భ‌స్ ‘కల్కి 2898 AD మూవీ నుంచి వ‌చ్చిన టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌ల‌ను పెంచేసింది.