హైద‌రాబాద్‌: హైటెక్‌సిటీ ఫ్లైఓవ‌ర్ పై నుంచి ప‌డి యువ‌తి మృతి

హైదరాబాద్ ఏరియా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కౄర రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువతి మరణించిన సంఘటన తలొత్తుంది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి ఒక యువతి మరణించింది. ఇదే ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని కలకత్తా పశ్చిమబెంగాల్ కు చెందిన స్వీటీ పాండేగా గుర్తించారు.

కోల్‌క‌త్తాకు చెందిన స్వీటీ పాండే స్నేహితుడితో కలిసి జే ఎన్ టి యు నుంచి ఐకియా వైపుగా స్కూటీపై బయలుదేరింది. అతడు అతివేగంగా స్కూటీ నడుపుతూ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పై రోడ్డును ఢీకొట్టాడు. దీంతో స్కూటీ వెనక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లై ఓవర్ పైనుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. గోడను ఢీకొట్టడంతో అతడికి గాయాలు అయ్యాయి. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ స్వీటీ చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్వీటీ పాండే హైదరాబాద్ లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ లోయర్ ట్యాంక్ బండ్ ఏరియాలో నివాసం ఉంటుంది. ఆమె స్నేహితుడు హైదరాబాద్‌కి రావడంతో గురువారం సాయంత్రం ఇద్దరూ కలిసి నగరంలో ఉన్న తమ ఫ్రెండ్స్‌ని కలిసేందుకు బయలుదేరారు. స్కూటీని వేగంగా తోలడంతో ఈ ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు స్వీటీ పాండే మరణించింది. అతివేగం ప్రమాదకరం అని చెప్పడానికి ఇప్పుడు జరిగిన సంఘటన ఓ ఉదాహరణ.