దర్శకుడు ప్రవీణ్ సత్తారు అందించిన అతి దారుణ డిజాస్టర్ ఘోస్ట్ తర్వాత హీరో నాగార్జున స్తెలంట్ అయిపోయాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ అంతటి అద్భుతాన్ని సాధించారు. ఆ సినిమాతో ఇటీవల తేరుకుని నాగ్ ఒకసారే రెండు సినిమాలను ప్రకటించబోతున్నాడు. చిట్టూరి శ్రీను నిర్మాతగా ఓ సినిమాని ప్రకటిస్తారు.
డ్యాన్స్ డైరెక్టర్ బిన్నీ మాస్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ మూల కథ, బెజవాడ ప్రసన్న కథ, బిన్నీ మాస్టర్ కథ విస్తరణతో ఈ సినిమా వుంటుందని సమాచారం. అలాగే థనుష్ తో దర్శకుడు శేఖర్ కమ్ముల చేయబోయే సినిమాలో నాగ్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమా ప్రకటన కూడా నాగ్ బర్త్ డే సందర్బంగా ఈ రోజు వస్తుందని సినీ వర్గాల టాక్.
ఈ సందర్భంగా ఈ రెండు సినిమాలను ప్రకటిస్తారట. ఈ రెండు సినిమాలతో పాటు బిగ్ బాస్ షోను కూడా సమాంతరంగా చేయాల్సి వస్తుంది. బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్ కూడా ఉండే ఉండవచ్చు. నాగ్, చిట్టూరి శ్రీను సినిమా సంక్రాంతి టార్గెట్గా రెడీ అవుతుంది. దాని కోసం పర్ఫెక్ట్ ప్లానింగ్ సెట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.నాగ్కు సంక్రాంతి సెంటిమెంట్ బలంగా ఉంది. అందుకే ఈ సినిమాను చకచక ఫినిష్ చేస్తున్నారు.