రజినీయా మజాకా జైలర్ కోసం జపాన్ నుంచి వచ్చిన ఫ్యాన్స్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. దీనితో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఆయన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మలేషియా, జపాన్, సింగపూర్ లో ఈయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ బాషా, మత్తు లాంటి చిత్రాలు అక్కడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిని రిపీట్ గా చూస్తారు.

కానీ రజనీకాంత్ నటించిన గత చివరి సినిమాలు పేట, దర్బార్, అన్నాత్తే కమర్షియల్ గా అక్కడ హిట్ కొట్టాయి. తాజాగా జైలర్ సినిమాను చూసేందుకు జపాన్లోని ఒసాకా నుంచి ఓ జంట సినిమాను చూడనీకి వచ్చారు. ఇప్పటికే ఈ సినిమా జపాన్లో కూడా విడుదలైంది. కానీ తలైవా గడ్డపైనే జైలర్ సినిమా చూడాలని రజినీకాంత్ జపాన్ ఫ్యాన్స్ అసోషియేషన్ లీడర్ యసుదా తెలిపారు. ఆయన రజిని పేరుతో జపాన్ లో పలు సేవా కార్యక్రమాలు చేశారు.

సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు కోసం జపాన్ కు రజిని వెళ్తే ఆ ఏర్పట్లన్ని యసుదానే చూసుకుంటారు. ఇక జపాన్ లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. జపాన్ లో రజనీకాంత్ తర్వాత ఎక్కువగా ఫాలోయింగ్ బేస్ ఉన్న హీరో ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆయన సినిమాలు అక్కడ కలెక్షన్లు ఆ రేంజ్ లో వస్తాయి. ఎన్నో రికార్డులు సృష్టించిన ఆర్ ఆర్ ఆర్‌ కథల పుస్తక రూపంలో అక్కడ ఎంతగానో ఆకట్టుకుంది.