రజనీకాంత్ హీరోగా చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమర్ డైరెక్షన్లో తమన్నా హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీలో రాధామారే పాటను విగ్నేష్ శివన్ తలైవా సినిమా కోసం రచించాడు. ఈ పాట సినిమాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ గురించి రాసుకొచ్చిన ఈ పాట ప్రేక్షకుల మనసుకు హత్తుకుంది. ఇక ఈ పాటను రచించిన విఘ్నేష్ – నయనతార భార్య, భర్తలు అన్న సంగతి తెలిసిందే. సరోగసి ద్వారా ఈ జంట ఇద్దరు పిల్లలని కూడా కన్నారు. ప్రస్తుతం వీరు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇక విగ్నేష్ శివ నయనతార తో కలిసి ఓ రొమాంటిక్ ఫోటో షేర్ చేశాడు.
తాను జైలర్ మూవీ కోసం రాసిన రాధేమార్ పాటను తన ఫ్యామిలీకి అంకితం ఇస్తున్నాను అంటూ పోస్ట్ చేశాడు. తలైవాకు పాట రాయడం నాకు ఇది మొదటిసారి కాగా ఈ పాటని తన పిల్లలు ఫ్యామిలీ కోసం రాసినట్లు నాకు అనిపిస్తుందని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం విగ్నేష్ శివన్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram