కూతురి కోసం కష్టపడుతున్న అర్జున్.. ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాతో..!

యాక్షన్ కింగ్ అర్జున్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నెగటివ్ రోల్స్ లోను నటించిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఈయన దర్శకత్వంలోను అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించాడు. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తమిళ్ హీరో విశాల్ సరసన హీరోయిన్ గా మదయానై సినిమాలో నటించింది. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత అర్జున్ స్వయంగా దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలను వహించిన సొల్లితెర‌వ‌ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ సినిమా తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత అర్జున్ కూతురు ఐశ్వర్యను హీరోయిన్గా నిలబెట్టడానికి మరో ప్రయత్నం చేయబోతున్నాడు. ఈసారి పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాడు. తనవోన్‌ బ్యానర్ శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప‌తాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే బాధ్య‌తల‌ను కూడా అర్జునే స్వయంగా చేపట్టాడు.

ఇందులో ప్రముఖ స్టార్ యాక్టర్ ఉపేంద్ర.. అన్నయ్య కొడుకు నిరంజన్ హీరోగా నటించబోతున్నాడు. జయరాం, ప్ర‌కాష్ రాజ్‌, స‌త్య‌రాజ్‌ లాంటి ప్రముఖులు ఎందరో ఈ సినిమాలో కీరోల్స్‌ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కే జి ఎఫ్ మూవీ ఫ్రేమ్ హిందెష్ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమా రూపొంద‌దుతుంది. ఐశ్వర్య హీరోయిన్గా అర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో మెద‌లైంది.

 

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun)