మ‌హేష్‌బాబు కాకుండా ‘ ఫిదా ‘ సినిమా మిస్ అయిన స్టార్ హీరో ఎవ‌రంటే..!

టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ ఎన్నో అందమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకి తెచ్చాడు. ఆయన సినిమాల్లో కథలు చాలా సహజంగా ఉంటాయి. అచ్చం మన చుట్టుపక్కల జరిగే కథలుగా అనిపిస్తూ ఉంటాయి. ఇక శేఖర్ తెరకెక్కిచ్చిన ఫిదా సినిమా మంచి హిట్గా నిలిచింది. ముందుగా శేఖ‌ర్ మహేష్ బాబుకు ఫిదా కథను మొత్తం చెప్పాడట. కానీ అప్పటికే మహేష్ స్టార్ డమ్ లో ఉన్నాడు.

వరుస సినిమాల నేప‌థ్యంలో ఫిదా మూవీ వ‌దులుకోవాల్సి వచ్చింది. అలాగే మహేష్ తో పాటు మరో హీరోకు కూడా ఫిదా కథను చెప్పాడట. ఆ హీరో మరెవ్వరో కాదు మెగాస్టార్ రామ్ చరణ్. మహేష్ బాబు తో పాటు చరణ్ కి కూడా ఫిదా కథను చెప్పాడట శేఖర్. చరణ్ కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి ఒప్పుకోలేకపోయాడట.

ఫైనల్ గా ఆ సినిమా కథ వరుణ్ తేజ్ కి చెప్పాడట. వరుణ్ తేజ్ కథను విని ఒకే చెప్పాడట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు శేఖర్. ప్రస్తుతం శేఖర్ ధనుష్ తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాను ఫాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నాడట.