ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..!!

రాజస్థాన్ లోని టోంక్‌లో ప్రాంతంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కిరాణా కన్వర్ అనే 18 ఏళ్ల మహిళ వజీర్పురా నివాసి. ఒక కాన్పులో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు మొత్తం నలుగురికి జన్మనిచ్చింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

దీంతో ఆ మహిళ ఉదయం 6 గంటల ప్రాంతంలో నలుగురు పిల్లలను ప్రసివించింది. ఇందులో ముగ్గురు నవజాత శిశువుల బరువు 1 కిలోల 350 గ్రాములు కాగా, నాలుగో శిశువు 1 కిలో 650 గ్రాములు బరువు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ పిల్లలను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచగా…1 కేజీ 350 గ్రాముల బరువున్న ముగ్గురు చిన్నారులను భద్రత నిమిత్తం జనానా ఆస్పత్రికి తరలించారు. అలాగే 1 కిలో 650 గ్రాముల బరువున్న పిల్లవాడిని మాత్రం తల్లి వద్దనే ఉంచినట్లు డాక్టర్ అగర్వాల్ తెలిపారు.