రకుల్ ప్రీత్‌ సింగ్ కాబోయే భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..

ప్రస్తుతం ఇండస్ట్రీ లో విడాకుల హడావిడి ఎక్కువైంది. చాలా మంది సెలెబ్రేటీలు విడాకులు తీసుకొని తమ కుటుంబాలతో పాటు అభిమానులను కూడా బాధపడుతున్నారు. అలానే సమంత, నాగచైతన్య విడిపోయి కుటుంబ సభ్యులతో పాటుగా ఫ్యాన్స్ ని చాలా బాధపెట్టారు. ఇక తమిళ్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి చేసుకొని దాదాపు 18 ఏళ్ళ తరువాత విడాకులు తీసుకొని విడిపోయారు. వారి విడాకుల విషయం లో రజినీకాంత్, ధనుష్ తండ్రి కస్తూరి రాజా చాలా బాధ పడ్డారు.

ఇదంతా పక్కన పెడితే ఒక స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటే కచ్చితంగా విడాకులు తీసుకుంటుంది అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్తున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నటుడు కమ్ నిర్మాత అయిన జాకీ భగ్నా తో ప్రేమలో పడిపోయింది. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోని వేణు స్వామి,రకుల్ ప్రీత్ సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. వేణు స్వామి మాట్లాడుతూ ‘ గతంలోనే రకుల్ ప్రీత్ సింగ్ వివాహ జీవితం గురించి నేను చెప్పాను. ఆమెకి జీవితంలో పెళ్లి అచ్చిరాదు. జాకీ ని ప్రేమిస్తున్నప్పటి నుండి రకుల్ సినీ కేరిర్ ఎలా ఉందొ మీరు చూస్తూనే ఉన్నారు. ‘ అంటూ కామెంట్ చేసాడు.

‘అలానే ఇప్పుడు ఆమెకి అవకాశాలు కూడా రావడం లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంటే సమంత లాగా ఆమె కెరీర్ కూడా డల్ అవుతుంది. సమంత లానే రకుల్ కూడా పెళ్లి తరువాత విబేధాల కారణం గా తన భర్తతో విడిపోవడం ఖాయం ‘ అని వేణు స్వామి కచ్చితంగా చెప్తున్నాడు. వేణు స్వామి చెప్పిన మాటలు నిజమని కొంతమంది ఒప్పుకుంటుంటే, మరి కొంతమంది ఏమో అతన్ని తిట్టిపోస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ వివాహ జీవితం ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈ సారి వేణు స్వామి చెప్పింది జరుగుతుందా, లేదా  అనేది రకుల్ పెళ్లి తరువాత తెలుస్తుంది.