సర్జరీ చేయించుకున్న హీరోయిన్..ఇప్పుడిదే హాట్ టాపిక్

సినిమా ఇండస్ట్రీలో సర్జరీ అనేది చాలా కామన్ విషయమే. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ లు సర్జరీలు చేయించుకున్నారు. అయితే ఇప్పుడు మరో నటి సర్జరీ చేయించుకుంది అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఆ నటి ఎవరో కాదు నటి పావని రెడ్డి. పావని రెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాదు తమిళ,మలయాళ భాషల్లో పలు సీరియల్స్ తో ఫేమస్ అయ్యింది. వరుస సీరియల్స్ తో బిజీబిజీగా ఉంది. అయితే పావని రెడ్డి 15 రోజులు ఆసుపత్రిలోనే ఉందన్న వార్త వైరల్ అవుతుంది. ఈ విషయాన్నీ ఆమెనే చెప్పింది. ఈ విషయంపై పావని స్పందిస్తూ..ఈ 15 రోజులు అత్యంత దారుణంగా గడిచాయి. మొదట నాకు మెడ దగ్గర చిన్న నొప్పిగా మొదలైంది.తర్వాత అది రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. నేను ఎంతో మంది వైద్యులను సంప్రదించాను. కానీ నొప్పి తగ్గలేదు. దీని వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. అంతేకాదు నిద్రపోకుండా ఏడ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి అని పావని రెడ్డి చెప్పింది. ఎండోస్కోపిక్ డిసెక్టమీ సర్జరీ చేసారని, తను ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో ఉన్నానని చెప్పింది.

అంతే కాకుండా ఈ సమయంలో తోడుగా నిలిచిన నా కుటుంబ సభ్యులకి, మిత్రులకు ధన్యవాదాలు తెలిపింది. పావని రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగు నటుడు ప్రదీప్ కుమార్ ని 2017 వాలెంటైన్స్ డే రోజున వివాహం చేసుకుంది. అయితే ప్రదీప్ కుమార్ 2017 మే నెలలో ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా అందరికి తెలిసిందే. ఆ తరువాత పావని రెడ్డి తెలుగులో కనిపించలేదు. తమిళ సీరియల్స్ చేస్తూ బిజీ అయిపోయింది. సీరియల్స్ లోనే కాదు పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా పావని రెడ్డి మళ్ళీ ప్రేమలో పడిందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.


ఆమె తమిళ కొరియోగ్రాఫర్ అమీర్ ఎడిసన్‌తో లవ్ లో ఉండనే వార్తలు ఉన్నాయి. అంతేకాదు వీరు డేటింగ్ లో కూడా ఉన్నారంట. అంతే కాదు పావని సర్జరీ జరిగినప్పటి నుంచి తను కూడా హాస్పిటల్ లోనే పావని తోడుగా ఉన్నారంట.