విడాకుల తర్వాత నిహారిక సంచలన నిర్ణయం.. తాళిని ఏం చేసిందంటే

మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక విడాకులు వ్యవహారంపై ప్రస్తుతం పలు విషయాలు ప్రచారంలో ఉన్నాయి. 2020 డిసెంబర్‌లో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా రాజస్థాన్‌లో జరిగింది. అయితే రెండేళ్లకే వీరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని అంతా భావించారు. అనూహ్యంగా జులై 5న వీరిద్దరూ కోర్టులో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలకు నిహారిక ప్రవర్తన కారణమనే వాదనలున్నాయి. ఆమె సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి.

ఆమె మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరిద్దరూ వేర్వేరు రంగాలకు చెందిన వారు. ఆమె సోషల్ లైఫ్ పేరుతో తరచూ పబ్‌లకు వెళ్తుంటుంది. దీనికి ఆమె అత్తమామలు అభ్యంతరం చెప్పారని తెలుస్తోంది. మరో వైపు ఆమె కొన్నాళ్ల క్రిందట ఓ పబ్‌ డ్రగ్స్ వ్యవహారంలో ఆమెకు సంబంధం లేకపోయినా టీవీ ఛానళ్లలో విస్తృతంగా ప్రచారం సాగిందని తెలుస్తోంది. ఆ వ్యవహారంపై ఆమె ఇంట్లో గొడవ జరిగి విడాకులకు కారణమైందని టాక్. ఇక విడాకుల తర్వాత ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

విడాకులు మంజూరైన తర్వాత నిహారిక తన తాళి ఏం చేసిందని అంతా చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఓ విషయం బయటకు పొక్కింది. ఆమె తాళిని తన మాజీ భర్తకు కొరియర్‌లో పంపించిందని టాక్ వినిపిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె అత్తమామలకు తగ్గట్టు వారి కుటుంబంతో కలిసి పోయి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. అయితే స్వతహాగా గారాబంగా పెరిగిన అమ్మాయి కావడం, సినీ ఇండస్ట్రీకి చెందినది కావడంతో ఆమె తన నచ్చిన లైఫ్‌ను పెళ్లి తర్వాత కూడా గడిపింది. ఇక ఆమె లైఫ్ స్టైల్ చూసి పెద్దలు అభ్యంతరం చెప్పడం, పబ్‌లకు వెళ్లకుండా భర్తతో సంతోషంగా గడపాలని చెప్పడం ఆమెకు నచ్చలేదని అందుకే విడాకులు తీసుకుందని తెలుస్తోంది. విడాకుల వ్యవహారంలో ఏ ఒక్కరినీ తప్పుపట్టలేం. అయితే ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినా పరిస్థితి బాగుండేది. ఇరు కుటుంబాలు సంతోషంగా ఉండేవారు. కానీ అలా జరగక పోవడంతో విడాకుల వరకు వ్యవహారం వెళ్లింది.