ఖడ్గం సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మ.. ఇక తర్వాత వరుసగా ప్రేమాయణాలు నడుపుతూ బ్రేకప్ స్టోరీల గురించి తెగ వైరల్ గా మారుతూ ఉండేది. ఇప్పటికే ఐదు మంది బాయ్ ఫ్రెండ్ లతో బ్రేకప్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ కెన్యాన్ డ్రగ్ మాఫియా డాన్ ఆలీ పుంజీలిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత మూడేళ్లుగా లియాండర్ పేస్ తో ఈమె ప్రేమాయణం నడుపుతోంది. కానీ ఇటీవల ఈ జంట బ్రేకప్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ ఇద్దరిలో ఎవరు అధికారికంగా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.
వాస్తవానికి కిమ్, ఫేస్ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ జంట సోషల్ మీడియాలో నిరంతరం తమకు సన్నిహిత్యం ఉండే ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు విహారయాత్రలకు కూడా వెళుతూ ఉంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ నుంచి కిమ్ శర్మ అతని ఫోటోలను తొలగించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం మార్చి 29వ తేదీన ఫేస్ తో ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో తన ఆనందాన్ని తెలిపింది.
ఇటీవల కొంతకాలంగా ఇంస్టాగ్రామ్ లో అసలు అందుబాటులో లేరు.. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రియుడుతో రెండవ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ శర్మ ఎలాంటి పోస్ట్ కూడా చేయలేదు. దీంతో ఈ జంట ఇద్దరు కలిసి బాగా షికారులు చేయడం జరిగింది. కానీ ఇంతలోనే ఇలా బ్రేకప్ వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంపై ఎవరు అధికారికంగా కన్ఫర్మేషన్ ఇస్తారేమో చూడాలి మరి.