సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య కాస్త చనువు గా ఉన్నారంటే చాలు వారిద్దరి మధ్య ఏదో ఒకటి ఉందంటూ వార్తలు రాసేస్తూ ఉంటారు. అయితే అలాంటి వాటిలో కొన్ని నిజం ఉంటే మరి కొంతమంది కాసిప్స్ గాని మిగిలిపోతూ ఉంటాయి. అలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అలనాటి హీరోయిన్ ఖుష్బూ గతంలో ఒక హీరోతో ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు విడిపోయారు అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఖుష్బూ.. గతంలో కోలీవుడ్ నటుడు ప్రభు తో జోడిగా పలు సినిమాలలో నటించింది .. దీంతో వీరిద్దరి మధ్య పలు రూమర్స్ కూడా వినిపించాయి.ఈ విషయంపై తాజాగా ప్రముఖ నటి కాకినాడ శ్యామల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేయడం జరిగింది. కాకినాడ శ్యామల మాట్లాడుతూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ఖుష్బూ బాలనటిగా తన కేరియర్ ను మొదలు పెట్టింది స్టార్ హీరోలలో దాదాపుగా అందరితో కూడా కలిసి నటించింది అంటూ తెలిపింది .ఈమె సినీ కెరియర్ల ఇప్పటివరకు రెండు వందలకు పైగా సినిమాలలో నటించింది.
చిన్న తంబి అనే సినిమాలో ప్రభు, ఖుష్బూ కలిసి నటించగా ఈ సినిమా తమిళంలో పెను సంచలనాన్ని సృష్టించింది ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత 1993 సెప్టెంబర్లు వీరిద్దరికీ పెళ్లి కూడా జరిగిందట.. అయితే ప్రభువు కుటుంబం ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.. ప్రభు దూరమైన తర్వాత కుసుకు మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ మానసిక వేదన తర్వాత కుష్బూ కోలు కోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాతే డైరెక్టర్ సుందర్ ను వివాహం చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.