మహేశ్ అభిమానులకు భారీ బొక్క తప్పదా..? మాటల మాంత్రికుడు నిలువునా ముంచేస్తున్నాడా..?

మహేష్ బాబు అభిమానులు త్వరలోనే బ్యాడ్ న్యూస్ వినబోతున్నారా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఘట్టమనేని హీరో మహేష్ బాబు .. ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఎస్ ఎస్ ఎం బి 28 అనే సినిమా ను చేస్తున్నాడు . ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ ఘనంగా ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం .. మహేష్ బాబు త్వరలోనే సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ కి టూర్ వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఎస్ ఎస్ ఎం బి 28 షెడ్యూల్ వాయిదా పడబోతుంది అంటూ ఓ న్యుస్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సైతం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఈ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఇదే క్రమంలో ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన ఈ సినిమా షూట్ ఐదోసారి వాయిదా పడింది అంటూ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అంతేకాదు ఒకవేళ త్రివిక్రమ్ మహేష్ బాబు సీరియస్ నెస్ లేకుండా ఇలాగే సిల్లీగా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఎస్ఎస్ఎంబి 28 సినిమా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎస్ ఎస్ ఎం బి 28 పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది..!!