బాలీవుడ్ ఇండస్ట్రీని ఎడమ కాలితో తన్నిన స్టార్ హీరోయిన్.. సౌత్‌పైనే కన్ను!

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ 2022లో రొమాంటిక్ డ్రామా మూవీ “సీతా రామం”తో సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ లుక్స్ చాలా బాగున్నాయి. ఎంతో అందంగా కనిపించినా ఈ తార చాలా మంది గుండెలను కొల్లగొట్టింది. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఈ కుందనపు బొమ్మ ప్రస్తుతం సౌత్‌లోనే తన మార్కెట్‌ను విస్తరించుకోవడంపై దృష్టి సారించింది. అందుకే ఆమె నేచురల్ స్టార్ నానితో కొత్త సినిమాకి సైన్ చేసింది.

మృణాల్ కొత్త సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆమె హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కుందని, నగరంలో ఎక్కువ సమయం గడపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఆమె హైదరాబాద్‌లోని టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, బెంచ్‌మార్క్ టాలెంట్స్‌తో జతకట్టింది. ఈ నటికి తమిళం, మలయాళం సినిమాల్లో హీరోయిన్‌గా నటించడానికి కూడా ఆఫర్లు వచ్చాయి. కాగా గజినీ ఫేమ్ సూర్య నటించిన అప్‌కమింగ్ ఫిల్మ్ సూర్య 42లో నటించడానికి మృణాల్‌ ఒప్పుకున్నట్లు టాక్. ఈ పుకార్లు నిజమైతే సౌత్‌లో మృణాల్‌కు సౌత్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ దక్కుతుంది.

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్‌లో సుప్రసిద్ధ నటి, అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఆమె ఇప్పుడు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమపై తన దృష్టిని పెట్టింది. ఎందుకంటే ఆమె తొలి చిత్రం హిట్ అయ్యింది. మృణాల్‌ భవిష్యత్తులో ఆమె మరిన్ని దక్షిణ భారత చిత్రాలలో నటించే అవకాశం ఉంది. దక్షిణాదిలోని ఆమె అభిమానులు ఆమె రాబోయే చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటి పెద్ద తెరపై మరపురాని పర్ఫామెన్స్ లు పాత్రలు పోషించాలని ఉవ్విలూరుతోంది.