MM. కీరవాణికి కరోనా.. ఆందోళనలో మెగా ఫ్యామిలీ..!!

తెలుగు సినీ పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేశారు RRR చిత్రంతో దర్శక ధీరుడు రాజమౌళి. ఆస్కార్ అవార్డు విన్నర్ తో కీరవాణి కూడా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మరొకసారి పాపులర్ చేయడం జరిగింది. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో ఈ పాటకు అవార్డు రావడం కోసం చిత్ర యూనిట్ చాలా డబ్బులు ఖర్చు చేసి మరి ప్రమోషన్స్ ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు చివరికి ఆస్కార్ అవార్డు అయితే గెలుచుకోవడంతో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Chiranjeevi honours SS Rajamouli, MM Keeravani for Oscar win - Hindustan  Times
ఇలా అవార్డుల సైతం ముగించుకొని ఇండియాకి వచ్చిన RRR చిత్ర బృందం తాజాగా కీరవాణి హాస్పిటల్ బెడ్ పైన పడుకున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం అన్ని ప్రాంతాలు తిరగడం జరిగింది చిత్ర బృందం. అందులో కీరవాణి కూడా ఎన్నోచోట్ల తిరిగారు దీంతో ఆయనకు ఇండియాకు వచ్చాక అస్వస్థత అనిపించడంతో స్వయంగా వెళ్లి దాని కరోనా టెస్ట్ చేయించుకున్నారట..

అక్కడ కరోనా పాజిటివ్ అని రావడంతో ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. అయితే ఈ విషయం ఇప్పటివరకు తెలుగు మీడియా ఛానల్లో అయితే ఎక్కడ వినిపించలేదు. కేవలం హిందీ మీడియాలో మాత్రమే ఈ విషయం వైరల్ గా మారుతుంది ఈ విషయాన్ని కీరవాణిని హిందీ మీడియాకు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ మీడియాతో మాట్లాడుతూ కీరవాణి నేను రేపు హాస్పిటల్ బెడ్ పైన ఉంటా నాకు కరోనా పాజిటివ్ అని చెప్పారు అంటూ హిందీ మీడియాలో కథలు వినిపిస్తున్నాయి. కీరవాణి కి కరోనా వచ్చిందని తెలిసి మెగా అభిమానులు చాలా భయాందోళనలకు గురవుతున్నారు.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కీరవాణి రామ్ చరణ్ ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ మెగా దంపతులు కీరవాణిని సత్కరించారు.. ఇక అంతే కాకుండా ఉపాసన కూడా ప్రెగ్నెంట్ ఉండడంతో ఇలాంటి విషయం తెలియడంతో కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు మెగా అభిమానులు. ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.