టాలీవుడ్ బ్యూటీ సమంతకు సౌత్ లోనే కాదు నార్త్ లోనే భారీ క్రేజ్ ఉంది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ తో ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ వెబ్ సిరీస్ లో తన నటనా విశ్వరూపం చూపించి అక్కడ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో సమంతకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
అయితే సమంత తర్వాత బాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న క్రెడిట్ సౌత్ భామల్లో రాశి ఖన్నాకే సొంతం అయింది. తాజాగా రాశి ఖన్నా `ఫర్జీ` అనే వెబ్ సిరీస్లో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ సిరీస్ లో విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలను పోషించారు.
ఫిబ్రవరి 10న ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్కు పాజిటివ్ టాక్ లభించింది. ఇందులో ఫేక్ కరెన్సీ ఎక్స్ పర్ట్ గా మేఘా పాత్రలో రాశీఖన్నా అదరగొట్టింది. రాశి ఖన్నా చేసే యాక్షన్ సీక్వెల్స్ లు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. విమర్శకులు కూడా రాశి ఖన్నాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలే సౌత్ లో ఆఫర్లు లేక సతమతం అవుతున్న రాశి ఖన్నాకు ఫర్జీ వెబ్ సిరస్ బాలీవుడ్ పై ఆశలు రేపింది. ఇకపై ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుస ఆపర్లతో చక్కడం తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.