టాక్ షోతో అలరించడానికి సిద్ధమైన ప్రముఖ సింగర్..!!

ప్రముఖ గాయని స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పాప్ సింగింగ్ ట్రెండ్ ని మొదలు పెట్టిన స్మిత కొన్ని దశాబ్దాల నుంచి ప్రేక్షకులకు అల్లరిస్తుంది. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షో ఫిబ్రవరి 10 నుంచి సోనీ లివ్ లో ప్రసారం కానుంది.

ఇప్పటికి స్మిత తెలుగు ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతుంది. ఆమె పేరు వినగానే అందరికి ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇక స్మిత హోస్ట్ చేయబోతున్న “నిజం విత్ స్మిత” షో కి చంద్రబాబు నాయుడు, చిరంజీవి, నాని, అడివి శేష్ లాంటి ప్రముఖ సెలెబ్రిటీలను తీసుకురానున్నారని సమాచారం. అయితే ఈ షో ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకి వస్తాయి అని తెలుస్తుంది.

కానీ ఈ షో ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఆ షో ప్రసారమయ్యే ప్లాట్‌ఫామ్ కేవలం కోదిమంది కి మాత్రమే తెలుసు. సోనీ లివ్ ఎక్కువగా తెలుగు ప్రేక్షకులలో ఆదరణ పొందలేకపోయింది. కాబట్టి ఈ షో వేరే ఏదయినా పాపులర్ ప్లాట్‌ఫామ్ లో ప్రసారమైతే తెలుగు ప్రేక్షకుల నుండి ఎక్కువగా ఆదరణ దొరికి ఉండేది. తెలుగు వారికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌, అమెజాన్, ఆహా ఇవి మూడే బాగా దగ్గరయ్యాయి. వీటిలో ఆహా ఆల్రెడీ ఒక టాక్ షో బాలకృష్ణ తో నడిపిస్తూ బాగా పాపులర్ అవుతోంది. ఇకపోతే సింగర్ స్మిత గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ టాలెంటెడ్ సింగర్ మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ ని చంపడానికి ప్రయత్నించే ఒక నెగిటివ్ పాత్ర కూడా పోషించింది. అలాగే ఆట సినిమాలో కూడా యాక్ట్ చేసింది.