టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత కొద్ది నెలల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా కొద్ది నెలల పాటు ఇంటికే పరిమితమైన సమంత.. మళ్ళీ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ తో బిజీ అవుతుంది. అయితే తాజాగా తన హెల్త్ కండిషన్ పై సమంత ఓ షాకింగ్ అప్డేట్ ను ఇచ్చింది.
ప్రస్తుతం తాను మాయోసైటిస్ నెలవారీ చికిత్స ఐవీఐజి (ఇంట్రావీనస్ ఇమ్యునో గ్లోబలీన్) థెరపీ లో భాగంగా చికిత్స తాలూకు సెషన్ కి హాజరైనట్లు సమంత సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో పంచుకుంటూ `న్యూ నార్మల్` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్ సమర్దంగా పనిచేయించడంతో పాటు ఇతర వ్యాధుల కారణంగా ఇన్ ఫెక్షన్ భారినపడకుండా ఈ థెరపీ సహాయపడుతుందట.
ఇందుకోసం రోజుకూ సుమారు నాలుగు గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుందని సమంత స్పష్టం చేసింది. ఇక ఈ కొత్త ట్రీట్మెంట్ ను సమంత తన ఇంటి వద్దే ఉండి తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక అనారోగ్యానికి గురైనా సమంత వ్యాయామాలను ఏమాత్రం మానలేదు. `కష్టపడాలని, కష్టం అని తెలిసినా విడవకుండా కష్టపడితే ఫలితం తప్పక ఉంటుంది` అపి పేర్కొంటూ కఠినమైన వ్యాయామాలు చేస్తున్న వీడియోను కూడా సామ్ పోస్ట్ చేసింది. దీంతో సమంత పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగిరావాలని అభిమానులు ఆకాక్షిస్తున్నారు.