నయనతార ,విగ్నేష్ వివాహం అనంతరం నయనతార విరామం లేకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కథల విషయంలో ఆమె చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఉమెన్ సెట్రిక్ చిత్రాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. సౌత్లో అగ్ర కథానాయకుడుగా గుర్తింపు పొందిన ఈమె కెరియర్ పరంగా స్పీడ్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ తాజాగా ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది.
నయనతార చేతిలో ఉన్న ప్రాజెక్టు అన్నిటిని పూర్తి చేసి కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నదట. దాదాపుగా రెండేళ్లపాటు ఎలాంటి సినిమాలు చేయకుండా కేవలం ఇంట్లోనే ఉండాలని చూస్తోందట. దీంతో నయనతార విరామం వెనక పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. పిల్లల కోసమే నయనతార రెండేళ్ల పాటు విరామం తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.పిల్లలు కలిగిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. కుటుంబం అంటే ఎంత ఇష్టమో నాయనతార గతంలో కూడా ఇంటర్వ్యూలలో తెలియజేసింది.
ఇక తల్లికి దూరంగా చెన్నైలో ఉంటున్న ఈమె ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంది.ఎంతోమంది పిల్లలను దత్తకు తీసుకొని మరి వారి యొక్క భాగోకులను చూసుకుంటోంది .అలాగే వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తోంది.ఈ రకంగా నయనతార ప్రేమని పిల్లలు వృద్ధుల పైన చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మాతృమూర్తిగా కూడా మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ గ్యాప్ పిల్లల కోసమా లేకపోతే వ్యక్తిగత కారణాలవల్ల అన్నట్లుగా అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం షారుక్ ఖాన్ జవాన్ అలాగే తమిళ్లో ఇరైవాన్ అనే చిత్రాలలో నటిస్తోంది.