గీతాంజలి, పద్మనాభం మధ్య ఎలాంటి బంధం నడిచిందంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ పద్మనాభం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు ఇకపోతే అలనాటి పాత సినిమాలలో కమెడియన్ జోడి కట్టడం అనేది బాగా క్రేజీ కాంబినేషన్.. ముఖ్యంగా రమాప్రభ , రాజబాబు జోడి కి మంచి క్రేజ్ ఉండేది. అలాగే వీరితో పాటు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న మరొక కమెడియన్ జంట గీతాంజలి , పద్మనాభం. సుమారుగా 100కు పైగా సినిమాలలో వీరు కలసి నటించారు.

వీరిద్దరూ ఒకే సామాజిక వర్గం వారు కావడంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత బంధం ఏర్పడడమే కాకుండా ఇద్దరిపై ఎన్నో రకాల రూమర్స్ వచ్చేవి. అలాగే వీరిద్దరూ సినిమాలో ఉండాలని దర్శకనిర్మాతలు పట్టు పట్టి మరి నటించేవారు.. దాంతో ఏకంగా దశాబ్దం పాటు వీరి కాంబినేషన్ లేకుండా ఏ ఒక్క సినిమా కూడా రాలేదు. మీడియా కూడా వీరిద్దరిపై అనేక రకాల రూమర్స్ ను సృష్టించింది. దానికి తోడు అప్పట్లో వీరిద్దరూ కలిసి ఒకే కారులో ఎక్కువగా ప్రయాణం చేసేవారు అలా వీరి జంటపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.

షూటింగ్ కోసం కలిసి రావడం, కలిసి వెళ్లడం ఇలా అనేకసార్లు మీడియా కంటపడ్డారు. నిజానికి పద్మనాభం చాలా చదువుకున్న వ్యక్తి ఇలాంటి వార్తలను ఏమాత్రం లెక్క చేయరు. గీతాంజలి కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ దాంతో వారిపై వచ్చే వార్తలను వీరు చాలా ఈజీగా తీసుకున్నారు. అయితే గీతాంజలి, పద్మనాభం ఈ వార్తలకు స్పందించకపోయినా వీరి బంధం గురించి తెలిసిన వారు వీటికి అడ్డుకట్ట వేయాలని భావించేవారు. అయితే జెమినీ , వారాహి స్టూడియో లు గీతాంజలి, పద్మనాభం పై వచ్చే వార్తలను కొట్టి పారేయడమే కాకుండా వారి వ్యక్తిగత జీవితాలను నాశనం చేసే హక్కు మీకు ఎవరికిచ్చారు అని మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా వీరిద్దరి బంధం అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా మారింది.