డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్.. ఎవరంటే..?

హైదరాబాదులో డ్రగ్స్ కేసు మళ్ళీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు కేవలం ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ అడ్విన్ కేసులో ఇద్దరిని మాత్రమే అరెస్టు చేసినట్లు వినిపించాయి. తాజాగా డీజే మైరాన్ మోహిత్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న నేహా దేశ్ పాండే భర్త మైరాన్ పోలీసుల విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 200 పైగ డీజే లను గుప్పెట్లో పెట్టుకొని నిర్వహిస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, గోవా, ముంబై వంటి నగరాలలో డీజే తో బాగా ఫేమస్ అయ్యారని తెలియజేశారు.

Heroine Neha Deshpande Husband Myron Mohit Arrested In Drugs Case, Deets  Inside - Sakshi

కానీ 12 ఏళ్ల క్రితం హైదరాబాదు నుంచి ముంబైకి వెళ్లారని తోలుతా పబ్బులో వెయిటర్ గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత డ్రగ్ సప్లయర్గా మారినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. డీజే యూనిట్ డ్రగ్ దందా అని కొనసాగించారని గోవా డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న ఎడ్విన్ తో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. అన్ని మెట్రో సిటీలలో ఉన్న పబ్ లన్ని ఇతని ద్వారానే డ్రగ్స్ సరఫరా జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. 50 మందికి పైగా మైరాన్ కి డ్రగ్స్ ఫెడర్స్ తో సంబంధం ఉన్నట్లు తెలియజేశారు.

ఇక టాలీవుడ్ ,బాలీవుడ్ వ్యాపారాలతో కూడా మంచి రిలేషన్ ఉన్నట్లు సమాచారం.మైరాన్ భార్య హీరోయిన్ కావడంతో మొత్తం కాంట్రాక్ట్ బయటికి తీస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ లో కూడా పలు డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో కృష్ణ కుమార్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసింది ఈయన ఏకంగా ప్రభుత్వ బస్సులోనే పార్సెల్ రూపంలో తరలించే వారట. నేహా దేశ్ పాండే తెలుగులో దిల్ దివానా, త్రివిక్రయన్, దడ పుట్టిస్తా, వజ్రాలు కావాల నాయన, వీడేనా తదితర చిత్రాలలో నటించింది.