కూతురి ఫేస్‌ను ప్రపంచానికి చూపించిన ప్రియాంక చోప్రా.. క్యూట్ అంటూ నెటిజన్లు ఫిదా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ ఎట్టకేలకు తమ కుమార్తె మాల్తీ మేరీ ముఖాన్ని ఎట్టకేలకు ప్రపంచానికి చూపించారు. జోనాస్ సోదరులు, వారి భార్యలు హాజరైన జోనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ వేడుకలో ప్రియాంక తన కూతురి ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. ఈ ఈవెంట్ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

స్టార్ కిడ్ మాల్తీ తన తల్లి ఒడిలో కూర్చున్నట్లు ఈ పిక్స్‌లో కనిపించింది. మాల్తీ 2022లో అద్దె గర్భం ద్వారా పుట్టిందనే విషయం తెలిసిందే. కాగా అప్పటినుంచి ఆమె తల్లిదండ్రులు ఆమె ముఖాన్ని ప్రజలకు కనిపించకుండా దాచి ఉంచారు.

ప్రియాంక గతంలో మాల్తీకి సంబంధించిన అనేక ఫోటోలను షేర్ చేసింది కానీ ఆమె ముఖాన్ని ఎప్పుడూ చూపించలేదు. దీంతో ఫాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. కొందరు ఫేస్ చూపించిన దానికి ఫొటోలో కూతుర్ని ఎందుకు ఉంచడం అని కూడా ఆమెను తిట్టారు. బ్రిటిష్ వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రియాంక తన కుమార్తెపై చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ, అవి వినడానికి బాధాకరంగా ఉన్నాయని పేర్కొంది. జనాలు ఏం మాట్లాడినా వాటిని పట్టించుకోనంత దృఢంగా తాను మారానని అన్నారు. కాకపోతే తన కూతురిపై చేసిన వ్యాఖ్యలను తాను తట్టుకోలేకపోయాను అని తెలిపింది.

మొత్తంమీద, మాల్తీ ముఖం బహిర్గతం చేసిన ప్రియాంక ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. మంగళవారం జోనాస్ బ్రదర్స్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో గేమ్ ఆఫ్ త్రోన్స్ యాక్ట్రెస్ సోఫీ టర్నర్ కూడా హాజరైంది. ఈమెకు డేనియల్ జోనాస్ భర్త అవుతాడు. ప్రియాంక తన కుమార్తె మాల్టీ మేరీ మొదటి పుట్టినరోజును ఈ నెల ప్రారంభంలో బ్లాక్ గ్రాండ్‌గా జరిపింది.

ప్రియాంక చోప్రా చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఆమె తన ఓటీటీ డెబ్యూను రస్సో బ్రదర్స్ సిటాడెల్‌తో చేస్తుంది. అలానే అలియా భట్, కత్రినా కైఫ్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ చిత్రం జీ లే జరాలో నటించనుంది.