సౌత్ ఇండియన్ హీరోయిన్ ప్రణీత అందానికి, అభినయానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాతో ఆమె మరింత ఫేమ్ సంపాదించింది. ఓ బిడ్డకు తల్లైనా నేటికీ ఆమె తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు డిజైనర్ దుస్తులను ధరిస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
ప్రణీత ధరించే దుస్తులు, ఫ్యాషన్ పై ఆమెకున్న అభిరుచిని తెలుపుతాయి. ఆమె తన గ్లామరస్ మరియు క్యాజువల్ అప్పియరెన్స్లతో చూపరులను తల తిప్పుకోనీయడం లేదు. తాజాగా పోస్ట్ చేసిన స్టిల్స్ వావ్ అనిపిస్తున్నాయి. ట్రాన్స్ పరెంట్ షర్టులో తన అందాలను ప్రదర్శిస్తూ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ప్రణీత పోస్ట్ చేసిన ఫొటోలు ఆమె ఫ్యాషన్ వైఖరిని తెలియజేస్తున్నాయి. వైట్ కలర్ ప్యాంట్ ధరించింది. దానిపై ట్రాన్స్ పరెంట్ యెల్లో కలర్ షర్టు వేసుకుంది. వీటికి తగ్గట్టు నల్లని కళ్లద్దాలు ధరించింది. ఈ ఫొటోలతో తనలో అందచందాలు ఇంకా తగ్గలేదని, హీరోయిన్ పాత్రలకు తాను రెడీ అనే సందేశాన్ని సినీ ప్రియులకు, మేకర్స్ కు పంపించింది. ప్రణిత సుభాష్ 2010లో కన్నడ చిత్రం పోర్కిలో దర్శన్ సరసన కథానాయికగా నటించింది. ఆమె తన మొదటి సినిమా అరంగేట్రం తర్వాత తక్షణమే ఫేమ్ సంపాదించింది.
కన్నడ సినీ ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి లెక్కలేనన్ని ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత, ఆమె చేసిన చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోయినా, కానీ ఆమె ఇప్పటికీ తన స్టార్డమ్ను కొనసాగించాలని కోరుకుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. అది ఆమెకు పేరు తెచ్చిపెట్టింది.