డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ నభా నటేష్ యాక్సిడెంట్ కు గురైందట. ఈ విషయాన్ని నభా స్వయంగా తెలిపింది. అయితే యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు కాదు.. గత ఏడాది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యమా జోరు చూపించిన ఈ ఇస్మార్ట్ పోరి.. గత ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. సినిమా ఆఫర్లు రావడం లేదు అని అనుకున్నారు అందరూ. కానీ అసలు విషయం నభా ఇప్పుడు బయట పెట్టింది. గత ఏడాది తనకి యాక్సిడెంట్ అయిన విషయాన్ని ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది.
`గత సంవత్సరం నాకు చాలా కష్టంగా గడిచింది. నేను ఒక ఘోర ప్రమాదంలో పడ్డాను. దాని వాల్ల నా లెఫ్ట్ షోల్డర్ కు తీవ్ర గాయమైంది. ముల్టీపుల్ బోన్ ఫ్యాక్చర్స్ అయ్యింది. వరసగా అనేక సార్లు సర్జరీలు చేయవలసి వచ్చింది. ఆ సమయంలో నేను మానసికంగా, శారీరకంగా భరించలేని బాధని అనుభవించాను. ఇప్పుడు పూర్తిగా కోలుకోన్నాను. గతంలో కంటే బలంగా మారాను. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో అలరించేందుకు రెడీ అయ్యాను.` అని నభా తన పోస్ట్ లో పేర్కొంది. అంతేకాదు, తన గాయానికి సంబంధించిన గుర్తు కనిపించేలా ఓ ఫోటోను సైతం షేర్ చేసింది. దీంతో అభిమానులు మీరు మళ్లీ మునుపటిలా తెరపై ఎనర్జిటిక్గా కనిపించాలని ఆకాక్షిస్తున్నారు.
https://twitter.com/NabhaNatesh/status/1612685431371628546?s=20&t=Ar8PIxQsgehX6IcsRVWwWw