ఆ కుర్ర హీరోకి క్రేజీ డిమాండ్.. రోజుకి రూ.2 కోట్ల రెమ్యునరేషన్..!

కార్తిక్‌ ఆర్యన్ గురించి తెలుగు వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈ హీరోకి బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ అణువంత అయినా లేని ఈ నటుడు తన స్వశక్తితో, సొంత ప్రతిభతో బాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 2022లో ‘భూల్‌ భులయ్యా-2’ మూవీతో సెన్సేషనల్‌ స్టార్‌గా అవతరించాడీ కుర్ర హీరో. కాగా గత కొద్ది రోజులుగా ఈ హీరోకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అదేంటంటే, తన ఫస్ట్ సినిమాకు జస్ట్ రూ.1.75 లక్షలు రెమ్యునరేషన్ పొందిన కార్తిక్‌.. ఇప్పుడు ఒక సినిమా కోసం రోజుకి రెండు కోట్లు తీసుకున్నాడట. ఈ సినిమాలో కేవలం 10 రోజులు యాక్ట్ చేసినందుకు రూ.20 కోట్లు పుచ్చుకున్నాడట. ఈ వార్త బీభత్సంగా వైరల్ అవుతూ చివరికి కార్తిక్‌ వద్దకు కూడా చేరింది. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో కార్తిక్‌ని ఇంటర్వ్యూయర్ ఇదే ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం కార్తిక్‌ ‘ఎస్’ అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

రెమ్యునరేషన్ గురించి జరుగుతున్న ప్రచారంపై కార్తిక్‌ స్పందిస్తూ ”నేను కరోనా టైమ్‌లో ఒక సినిమాలో నటించాను. ఆ సినిమాకు రూ.20 కోట్ల పారితోషికం తీసుకున్నాను. కానీ నేను ఆ మూవీని 10 రోజుల్లోనే కంప్లీట్ చేశా. అలా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంవల్ల ప్రొడ్యూసర్లు ఎంతో డబ్బును ఆదా చేసుకోగలిగారు. దీనివల్ల నేను అంత మొత్తంలో డబ్బులు తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక 2022లో నా హారర్‌ కామెడీ మూవీ ‘భూల్‌ భులయ్యా-2’ సూపర్ హిట్ అయ్యి అందరికీ పెద్ద ప్లస్‌గా మారింది. సాధారణంగా నేను డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటా. వాటి ద్వారా ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌ చేయడానికి నా వంతు కష్టపడతా.” అని పేర్కొన్నాడు. ఈ వార్త నిజమే అని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ హీరో ‘అల వైకుంఠపురంలో’ సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్నాడు.