యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం.. బుల్లితెర న‌టులు దిగ్భ్రాంతి!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విష్ణుప్రియ త‌ల్లి క‌న్నుమూశారు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌నంగా గురువారం ఆమె తల్లి తుదిశ్వాస విడిచారు. త‌న త‌ల్లి క‌న్నుమూసిన విష‌యాన్ని విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలుపుతూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది.

`మై డియర్ అమ్మ ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం, నువ్వే నా బలహీనత. నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినా.. నాతోనే, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా` అంటూ ఎంతో ఎమోష‌న‌ల్ గా విష్ణుప్రియ పోస్ట్ పెట్టింది.

దీంతో విష్ణుప్రియ త‌ల్లి మ‌ర‌ణం ప‌ట్ల బుల్లితెర న‌టులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా, చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసిన విష్ణుప్రియ బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోతో యమ పాపులర్ అయింది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తోంది.