కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న నటుడు అజిత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినిమాలలోనే కాకుండా రేసింగ్ విషయంలో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంటాడు అజిత్. ఇక కోలీవుడ్లో నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు.ఈ మధ్యకాలంలో తెలుగులో అజిత్ ది ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా సంక్రాంతికి తునీవు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగబోతోంది.
సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదలవుతున్నప్పటికీ తన సినిమా మీద కాన్ఫిడెంట్గా అజిత్ ఈ సినిమానీ విడుదల చేస్తున్నారు దిల్ రాజు. దిల్ రాజు ఈ సినిమాని తెలుగులో ఏకంగా రూ.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పోటీకోసమే అన్నట్లుగా ఈ సినిమాని దిల్ రాజు కొనుగోలు చేశారని కొంతమంది సినీ ప్రముఖులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ వారు సంక్రాంతికి తన వారసుడు సినిమాకు పోటీగా ఈ సినిమానీ తీసుకురాబోతున్నారని సమాచారం. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతంగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇలాంటి సమయంలోనే దిల్ రాజు తన వారసుడు సినిమాకు సాధ్యమైనంత ఎక్కువ థియేటర్స్ ని కేటాయించబోతున్నట్లు సమాచారం. దీంతో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల కంటే ఎక్కువగా వారసుడు సినిమాకే థియేటర్లు లభించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దిల్ రాజు తునీవు సినిమాను కూడా దక్కించుకోవడంతో తన వద్ద ఉన్న అదనపు థియేటర్లను ఈ సినిమాకి కేటాయించబోతున్నట్లు సమాచారం. సంక్రాంతి బాధితులు దిగుతున్న చిత్రాలలో మరి ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి మరి.