రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం ఆది పురుష్. ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం 3d టెక్నాలజీతో తెరకెక్కించడం జరిగింది డైరెక్టర్ ఓం రౌత్. ఇందులో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తూ ఉన్నది. మరొక ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇంత భారీ తారకనే ఉండడంతో ఈ సినిమా పైన ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు చిత్ర బృందం. అయితే టీజర్ విడుదల చేసిన తర్వాత ఊహించని విధంగా సినిమాపై నెగిటివ్ టాక్ రావడం జరిగింది.
గ్రాఫిక్స్ విషయంలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరగడంతో ఈ సినిమాకు దెబ్బ పడుతుందని ఉద్దేశంతో చిత్ర బృందం ఇప్పట్లో ఈ సినిమాని విడుదల చేయడం మంచిది కాదని భావించి మళ్లీ దర్శక నిర్మాతలతో మాట్లాడి రి వర్కింగ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ప్రభాస్. దీంతో ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆదిపరుష్ సినిమా సమయానికి వస్తుందో లేదో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు మరింత ఆలస్యం జరిగిన జరగవచ్చని ఆవెంట వెంటనే ప్రభాస్ సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలయితే బాగుంటుందని ఆలోచనలు చిత్ర బృందం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ టాక్ ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్లో వచ్చే అవకాశం లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 2024 లోని సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచనలు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా విడుదల సమయంలో ఫెస్టివల్ సీజన్ ఉంటేనే బాగా కలిసి వస్తుందని ఇలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సమయంలో ఒకవేళ నష్టాలు వచ్చినా సరే అంతగా నష్టాలు మిగలవని టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.