Rc-15 కి నాన్ థియేట్రికల్ రైట్స్ కి భారీ ఆఫర్..!!

టాలీవుడ్ లో హీరో రామ్ చరణ్ RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.ప్రస్తుతం తన నటిస్తున్న చిత్రాలు అన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం RC-15 అనే ఒక వర్కింగ్ టైటిల్ తో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే .ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లు కూడా గతంలో లీక్ అయ్యాయి. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తోంది. వీరితోపాటు సునీల్, అంజలి తదితరులు నటిస్తున్నారు.

RC15 Release Date Locked!

ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమండ్రిలో షూటింగ్ మొదలుపెట్టి ఆ తర్వాత పలు ప్రాంతాలలో ఈ షూటింగ్ ని జరిపారు. రీసెంట్గా న్యూజిలాండ్ కి వెళ్లిన చిత్ర బృందం అక్కడ కూడా రామ్ చరణ్, కియారా పైన ఒక పాటను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న చిత్ర బృందం రాజమండ్రి గోదావరి తీరాన ఇసుకదిన్నెల పైన రామ్ చరణ్ పాల్గొని ఒక రాజకీయ మీటింగ్ కు సంబంధించి కీలకమైన ఘట్టాన్ని చిత్రీకరించినట్లు సమాచారం.

ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఇప్పటికే 70% పూర్తి అవ్వగా తాజాగా ఈ సినిమా షెడ్యూల్ ని కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా పైన ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషలు ఓవర్సీస్ హక్కులను రూ.45 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి ఒక ప్రముఖ ఓవర్సీస్ సంస్థ ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ సంస్థ జీ ఛానల్ నాన్ థియేటర్ రైట్స్ రూ.200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.