చిన్నపుడే లైంగిక వేధింపులకు గురయ్యా.. `మట్టి కుస్తీ` భామ ఎమోష‌న‌ల్ కామెంట్స్‌!

ఐశ్వర్య లక్ష్మి.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళం లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు.. `గాడ్సే` మూవీ తో తెలుగు తెర‌కు పరిచయమైంది. ఆ తర్వాత `అమ్ము` మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య లక్ష్మి.. ఇటీవల `మట్టి కుస్తీ` మూవీ తో మరోసారి పలకరించింది.

చెల్లా అయ్యావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ హీరోగా న‌టించాడు. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ సినిమాలో రెజ్లర్ గా తనదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే టాక్ బాగున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబట్టలేకపోయింది. ఇదేలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వ‌ర్య ల‌క్ష్మి.. చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్ల‌డించి ఎమోష‌న‌ల్ అయింది.

ఆమె మాట్లాడుతూ.. `చిన్నప్పుడు కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు నా ప్రైవేట్ పార్ట్స్ ని అస‌భ్యంగా తాకాడు. ఆ రోజు నేను పసుపు రంగు బట్టలు వేసుకున్నా. ఆ సంఘటనతో అప్పటి నుండి పసుపు బట్టలు వేసుకోవాలంటే భయం. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఇక ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాలకు ప్రమోషన్స్ కోసం వెళ్ళినపుడు ఇటువంటి సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాం` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.