ఈ ఏడాది నటి మీనా జీవితంలో పెను విషాదాన్ని నింపింది. మరచిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రాణానికి ప్రాణంగా భావించి పెళ్లి చేసుకున్న భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం మీనాను కోలుకోలేని దెబ్బ కొట్టింది. దక్షిణాది చిత్రసీమలో అగ్రహీరోయిన్గా రాణించిన మీనా 2009లో వివాహం చేసుకొన్నారు.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్తో మీనా ఏడడుగులు నడిచింది. ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది. అయితే లివర్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్.. కొన్ని నెలల క్రితం చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషాదం నుంచి బయటపడేందుకు మీనాకి చాలా కాలమే పట్టింది.
ఇక ఇటీవల విదేశీ పర్యటన చేసి వచ్చిన మీన.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుందట. భర్త మరణం తర్వాత ఇంటికే పరిమితం అయిన మీనా.. మళ్లీ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయాలని ఆమె డిసైడ్ అయిందట. మలయాళంలో మోహన్ లాల్కు జోడీగా ఆమె `దృశ్యం 3` చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాతో ఆమె రీఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లోనూ మీనా పలు సినిమాలకు ఒప్పుకుందంటూ టాక్ నడుస్తోంది.