టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో హీరోయిన్ సమంత మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. దాదాపుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది సమంత. అయితే గడిచిన కొద్దిరోజుల క్రితం ఇమే మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది.దీనికి తోడు ఈమె చాలా బలహీనంగా మారిపోయింది అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. సమంత నటించిన యశోద చిత్రం రేపటి రోజున విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో సమంత బిజీగా ఉన్నది.
ఇక మయో సైటీస్ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటున్న సమంత. సైలెన్ సహాయంతో యశోద సినిమా డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. తాజాగా సమంత మరొక ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది.
మయోసైటిస్ వ్యాధి కారణంగా బలహీనంగా మారిపోయిన సమంత ఫోటోలు చూసిన అభిమానులు ఏంటి సమంత ఇలా మారిపోయింది అంటూ చాలా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా సమంత ధరించిన కళ్లద్దాలు, ఉంగరాలు, ఫింగర్స్ ని క్రాస్ చేయడంతో అరచేతికి పడిన ముడతలు చూసి కొంతమంది 80 ఏళ్ల బామ్మ గా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవలే తన ఆరోగ్యం గురించి వచ్చిన వార్తల్ని పరిశీలించినట్లు తెలియజేసింది సమంత. కొంతమంది తాను చనిపోయినట్లు రాయడంపై ఆవేదన వ్యక్తం చేసిందని తెలియజేస్తోంది. తాను ఇంకా చావలేదు అంటూ కౌంటర్ ఇస్తూనే ఎమోషనల్ అయ్యింది. సమంత నటించిన యశోద సినిమా సరోగసి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ, ముకుందన్ తదితరులు నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సమంతకు సంబంధించి ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram