టాలీవుడ్ లో పాన్ ఇండియా స్థాయిలో పేరు పొందిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రభాస్ అభిమానులను చాలా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.విలక్షణమైన నటుడు జగపతిబాబు కూడా ఇందులో నటిస్తూ ఉండగా.. మలయాళ స్టార్ గా పేరుపొందిన పృధ్విరాజ్ సుకుమారాన్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే వరదరాజు మన్నారుగా పృథ్వీరాజ్ లుక్ నీ తెలియజేయడం జరిగింది.
సలార్ సినిమాపై పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా సోషల్ మీడియా నివేదికగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దల కొడుతుందని తెలియజేస్తూ మంచి హైప్ ని తెరకెక్కించారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. సలార్ సినిమా షూటింగ్ సెట్లో పనిచేస్తున్న భారతదేశంలోని మోస్ట్ క్రియేటివ్ మైండ్స్ లో ఒకరని చూడగలిగే అవకాశం నాకు లభించింది అని తెలియజేశారు. ప్రశాంత్ నీల్ సార్ మీకు మీ సొంత లీగ్ లో ఉన్నారు. మీరు తీస్తున్న సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తుంది అంటూ తెలియజేశారు.
ఇటీవల పృథ్వీరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి తర్వాత మాస్ యాక్షన్ కమర్షియల్ జూనియర్లకు ప్రభాస్ కొంచెం దూరం అయ్యారని ఇప్పుడు సలార్ సినిమాతో పూర్తిగా వాటన్నిటికీ చెక్ పెట్టబోతున్నారని తెలియజేశారు.
ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారు ఈ చిత్రంలో అలా కనిపిస్తారని తెలియజేశారు. హై వోల్టేజ్ యాక్షన్స్ అన్ని వేషాలు, ఎలివేషన్ చూపించడంలో డైరెక్టర్కు ఎవరు సాటి రారని తెలియజేశారు. పృథ్వీరాజ్ ఇలా చెప్పడంతో దీంతో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.