నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాని త్వరలోనే పూర్తి చేయనున్నారు.ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ పూర్తి అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్లుగా ఇదివరకే డేటును కూడా తెలియజేశారు. ఈ సినిమా తర్వాత నందమూరి బాలయ్య, డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇందులో నటీనటులు నిర్మాతలు కూడా ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. అయితే మెయిన్ హీరోయిన్ గా ఇంకా ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో బాలయ్య బాబు కూతురు గా శ్రీ లీలా మాత్రమే ఫిక్స్ అయినట్లు తెలిసింది. కానీ మెయిన్ హీరోయిన్ గా మాత్రం ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. దీంతో నయనతార ఇప్పటికె కథని రెండుసార్లు వినిపించడం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథ విషయంలో నయనతార పెద్దగా ఏమి డౌట్స్ క్రియేట్ చేయలేదు కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అందర్నీ భయపెడుతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం నయనతార రేంజ్ కు తగ్గట్టుగా రూ.10 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ఆట్లి దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ చిత్రం కోసం ఈమె ఇంత తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు బాలయ్య సినిమా కోసం కచ్చితంగా ఇంతే రేంజిలో డిమాండ్ చేస్తుంది అన్నట్లుగా సమాచారం. మరి చిత్ర బృందం ఏం చేస్తుందో చూడాలి మరి.