నా బ్రతుకు ఇలా అవ్వడానికి కారణం ఆ నిర్మాతే..జాన్వీ కపూర్ సంచలన కామెంట్స్..!!

అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే . అమ్మకు మించిపోయిన అందంతో ప్రజెంట్ యువతను అల్లాడిస్తుంది . మరీ ముఖ్యంగా మోడ్రెన్ డ్రెస్సుల్లో హాట్ టెంప్టింగ్ ఫోజులు ఇవ్వడం జాన్వీ కపూర్ స్పెషాలిటీ . అంతేకాదు ఓ వైపు సినిమాలు చేస్తూనే ..మరోవైపు వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తుంది . ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా మిల్లి అనే సినిమాతో జనాల ముందుకు వచ్చింది.

ఈ బ్యూటీ ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన జాన్వీ కపూర్.. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి చేసిన కామెంట్స్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే జాన్వి కపూర్ ..ధడక్ అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది కరణ్ జోహార్. ధర్మ ప్రొడక్షన్స్ పేరుతో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

ఆయన గురించి జాన్వి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది . “నన్ను జనాలు ద్వేషించడానికి సులభమైన మార్గాన్ని కల్పించింది ఈ ధర్మ ప్రొడక్షన్స్. నాపై ట్రోలింగ్ కి ఐకానిక్ ధర్మ ప్రొడక్షన్స్ కారణమని నేను భావిస్తున్న.. నేను ఈ విధంగా స్ట్రెస్ గా ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ధర్మ ప్రొడక్షన్న్.. దీని గురించి ఎప్పటికీ ఒక క్షణం కూడా నేను బాధపడను ..ఎందుకంటే కరణ్ అతనికి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ ఎంత సృజనాత్మక నిర్ణయాలు తీసుకుంటారో నాకు తెలుసు.. అది మనిషి క్రియేటివ్ ను పెంపొందించేందుకు కట్టుబడి ఉంటుంది ..నా విషయంలో నా వరకు అది గౌరవంగానే ఉంటుంది ..అందరికన్నా ఎక్కువగా కరణ్ జోహార్ వంటి మేకర్ నమ్మకం ఎప్పటికీ తప్పుగా గా మారదు” అంటూ తన ఒపీనియన్ ఓపెన్ గా చెప్పేసింది.