టాలీవుడ్ లో ఫ్లాప్ నే చవిచూడని డైరెక్టర్ ఎవరంటే.. అందరికీ గుర్తుకొచ్చే పేరు రాజమౌళి. ఈ ఏడాది RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన నటన ప్రదర్శించారని చెప్పవచ్చు. ఇక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమాని కూడా తెరపైకి తీసుకురావాలని ఆలోచనలు ఉన్నట్లుగా రాజమౌళి ఎన్నోసార్లు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు..
అయితే ఇప్పుడు రాజమౌళి RRR చిత్రానికి సంబంధించి సీక్వెల్ ని కూడా తెరకెక్కించబోతున్నారనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతొంది. అయితే అమెరికాకు వెళ్లిన రాజమౌళి అక్కడ ఒక ఈవెంట్లో ఈ చిత్రానికి సంబంధించి సీక్వెల్ ఆలోచనలు చర్చలు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చినట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా తెలిపారు. ఇక సెకండ్ పార్ట్ లో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ తోనే తీస్తారా లేకపోతే ఏంటన్న సంగతి తెలియాల్సి ఉంది.
అయితే ఈ ప్రాజెక్టు రావడానికి మాత్రం చాలా సమయం పట్టొచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి మొత్తం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా చరవేగంగా జరుగుతున్నాయి షూటింగ్ వచ్చేయేడాది మొదలు కాబోతున్నట్లు సమాచారం. అలాగే రాజమౌళి ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయాలని ముందుగా అనుకున్నట్లు తెలుస్తోంది. మరి RRR సినిమా సీక్వెల్ ఎప్పుడు తెరపైకి వస్తుందా అంటే అటు మెగా అభిమానులు నందమూరి అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.