బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలోనే రిషి సునాక్కు శుభాకాంక్షలు చెప్తున్నారు. రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్ అవటం పట్ల తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి చరిత్ర సృష్టించాడు. భారతదేశంలో ప్రజలు అంత దీపావళి జరుపుకుంటున్న వేళ బ్రిటిష్ దేశానికి రిషి ఏకగ్రీవంగా ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. అలాంటి పండగ వేల రిషి బ్రిటన్ కి ప్రధాని అవటం పట్ల చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తూ రిషికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు.
‘భారతదేశం బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొంది 75 సంవత్సరాలు అవుతున్న వేళ.. బ్రిటిష్ వారిని భారతీయ కుటుంబాలకు చెందిన వ్యక్తి ప్రధాని అవ్వటం ఎంతో ఆనందంగా ఉంది.. అది కూడా మొట్టమొదటి హిందూ ప్రధాని ఆ దేశానికి అవుతాడని ఎవరు ఊహించరు”… అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో తన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. బ్రిటిష్ ప్రజలకు సేవ చేస్తానని బ్రిటన్ ప్రధానమంత్రి గా ఎన్నికైన తర్వాత ఆయన ప్రసంగంలో రిషి పేర్కొన్నాడు. నా దేశానికి సేవ చేసేందుకు నా జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవంగా భావిస్తున్నానని రిషి చెప్పుకొచ్చారు.
Who would have thought when India celebrates 75 years of Independence from the British, the British will get a Prime Minister of Indian origin, a first ever Hindu PM #RishiSunak #LifeComesFullCircle #India
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022