డీజేటిల్లు-2 చిత్రం హీరోయిన్ పై హింట్ ఇచ్చిన సిద్దు..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డిజే టిల్లు. ఈ చిత్రం అనుకోని విధంగా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఈ చిత్రంలో సిద్దు కామెడీ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ రాధిక పాత్రలో నేహా శెట్టి అద్భుతంగా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. త్వరలోనే డిజే టిల్లు-2 సినిమాని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కూడా యధావిధిగా ఉంటుంది అని అందరూ భావించారు. అయితే కేవలం ఈ సినిమా సీక్వెల్లో హీరోని మాత్రమే రిపీట్ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Anupama Parameswaran: క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్..? - Andhrajyothy

అయితే ఈ సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి కి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేనట్లుగా ఇటీవల ఒక ఈవెంట్లో కన్ఫామ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వర నటించబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలను తాజాగా హీరో సిద్దు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫోటోను షేర్ చేయడంతో ఈ విషయం నిజమనే విధంగా ఉందని అభిమానులు భావిస్తున్నారు.

ఇక అనుపమ వేసుకున్న టీ షర్ట్ ను ఉద్దేశిస్తూ.. నైస్ అను.. అని ఓ క్యాప్షన్ ఇచ్చారు. టీ షర్టు మీద అట్లుంటుంది మనతోని సినిమాలోని ఫేమస్ డైలాగ్ రాశారు. దీంతో డిజే టిల్లు -2 సినిమాలో అనుపమ హీరోయిన్గా లాక్ చేశారని అభిమానులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంపై అభిమానులు మాత్రం నేహా శెట్టి లాగా అనుపమ పరమేశ్వరన్ చేయలేదని భావనను తెలియజేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి.