Jr. NTR పెళ్లి లక్ష్మీ ప్రణతితో జరగడానికి ముఖ్య కారకులు ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల వివాహాం గురించిన వార్తలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నిన్న మొన్నటివరకు వీరి పెళ్ళి జరగడానికి గల కారణం చంద్రబాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని TDP ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్టులో ఈ జంట ముందుంటుంది. వంశీ ఆ మాట అనగానే ఇపుడు వారి పెళ్ళికి గల కారణం ఎవరై ఉంటారని ఆలోచిస్తున్నారు కదూ.

అక్కడికే వస్తున్నా, ఈ మీడియా వేదికగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చాలా విషయాలు ప్రస్తావించారు. తాజాగా అమరావతి రైతుల ఆందోళన నేపథ్యంలో ఓ ముసలావిడ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన విషయం విదితమే. దీని గురించి అతను మాట్లాడుతూ… తారక్ కు అమరావతికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. అమరావతి రైతులను పొలాలు ఇవ్వమని తారక్ ఏమైనా అడిగారా? అంటూ ఎదురు ప్రశ్న మీడియావారికి వేశారు. దాంతో ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హీరో తారక్ గురించి ఈ మధ్యకాలంలో అమరావతి రైతులు కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక వారి పెళ్లి విషయానికొస్తే, అది అనుకోకుండా జరగలేదని… ముందునుండే వారిమధ్య మంచి బంధం ఉందని, అది అర్ధం చేసుకొని ఇరు కుటుంబాలు పెళ్లి చేశాయని చెప్పుకొచ్చాడు. అంటే ఇండెరెక్ట్ గా వారి పెళ్ళికి ఎవరి ప్రమేయం లేదని చెప్పకనే చెప్పాడు. ఇక తారక్ కొత్త సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవ్వబోతోంది. దీపావళి పండక్కి ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ రానున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఆచార్య ప్లాప్ తరువాత కసిగా ఈ స్క్రిప్ట్ మీద కూర్చున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.