మహేష్ బాబు మేనకోడలని ఎపుడైనా చూసారా? ఇదిగో చూడండి ఇక్కడ!

టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోని చెప్పుకోదగ్గ నటులలో మహేష్ ఒకరు. కేవలం కళ్ళతోనే అభినయించగల సత్తా వున్న నటుడు మహేష్. ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి 3 తరాల నటీనటులు పరిశ్రమకు పరిచయం అయ్యారు. సూపర్ స్టార్ కృష పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా హీరోగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు. అలానే మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా బాల నటుడిగా ఈమధ్యనే తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

ఇకపొతే కృష్ణ ముగ్గురు కుమార్తెలలో ఘట్టమనేని మంజుల గురించి అందరికీ తెలిసినదే. ఎందుకంటే ఈమె మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. మిగతావాళ్ళు ఇంటికే పరిమితం అయ్యారు. మంజుల సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి షో – నాని – పోకిరి – ఏంమాయ చేసావే’ వంటి చిత్రాలను నిర్మించి సక్సెస్ కొట్టారు. ఇక మంజుల కూతురు అయినటువంటి జాహ్నవి స్వరూప్ కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సందీప్ కిషన్ హీరోగా మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాలో జాహ్నవి నటించింది.

అయితే ఈ మూవీ ప్లాప్ అవ్వడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత మహేష్ బాబు మేనకోడలు మరో చిత్రంలో నటించలేదు. అయితే ఇటీవల మంజుల తన కుమార్తెతో ఉన్న ఫోటోను పంచుకోవడంతో జాహ్నవి స్వరూప్ మరలా వార్తల్లో నిలిచింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా చురుగ్గా కనిపిస్తున్న మంజుల.. కూతురు జాహ్నవి ఫోటోలను అభిమానులతో పంచుకొని మిక్కిలి ఆనందాన్ని వ్యక్తం చేసింది. జాహ్నవి ఫోటోని చూసి ఆమె ఎంత ముద్దుగా ఉందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.