సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలు ఓ రేంజ్ లో హిట్ అవుతున్నాయి. రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్ఆర్ తో మరోసారి అదే విషయాన్ని ప్రూవ్ చేశాడు ఎస్ ఎస్ రాజమౌళి. సింగిల్ హీరోగా హిట్ కొట్టడం కన్నా మల్టీ స్టార్ హీరోగా హిట్ కొట్టడమే బెస్ట్ ఆప్షన్ ప్రస్తుతం ఉండే సినీ ఇండస్ట్రీకి అంటూ సినీ విశ్లేషకులు సైతం చెప్పుకొస్తున్నారు. కాగా ఇదే క్రమంలో టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాగా ఓ అదిరిపోయే కాంబో రాబోతున్నట్లు సమాచారం.
ఎస్ తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి కలిసి టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమాగా ఓ సినిమాలో నటించబోతున్నారట. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అక్కినేని నాగార్జునతో పాటు అక్కినేని అఖిల్.. మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున ఇద్దరు అన్నదమ్ములుగా మనకు కనిపిస్తారట. ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరో కాదు రీసెంట్ గా గాడ్ ఫాదర్ తో తిరుగులేని హిట్ ఇవ్వబోతున్న మోహన్ రాజా నే ఈ సినిమాను డైరెక్టర్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది .
అంతగా మోహన్ రాజాకు ఎందుకు మెగా అక్కినేని హీరోస్ అట్రాక్ట్ అయ్యారు అంటే కేవలం కథ అని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ కథలో నాగార్జున చిరంజీవి అన్నదమ్ములు. కాగా ఓ అనూహ్య సంఘటనతో వీళ్లిద్దరు విడిపోతారు . సీన్ కట్ చేస్తే వీళ్ళిద్దరూ వారసులు రిలేషన్షిప్ ఏదో తెలియకుండానే కాలేజ్ టైంలో మంచి ఫ్రెండ్స్ గా మీట్ అవుతారట. ఈ క్రమంలోని హీరోయిన్ కోసం అఖిల్, రామ్ చరణ్ గొడవ పడడం ..ఆ తరువాత కొడుకు భవిష్యత్తుల కోసం నాగార్జున మెగాస్టార్ చిరంజీవి ఎలా ఒక్కటి అయ్యారు.. అన్నదే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే నిజంగా అది ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రని తిరగరాసే విధంగా కలెక్షన్స్ ఉండబోతున్నాయి అంటున్నారు మెగా అక్కినేని అభిమానులు. మరి చూడాలి ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చిరంజీవి నాగార్జున ఈ రూమర్ పై ఎలా స్పందిస్తారో..?