టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీ అందుకున్న విజయ్ దేవరకొండ ఇక ఆ తరువాత లైగర్ సినిమాతో టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీగా అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా విడుదలయ్యాక బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అందరూ భావించారు కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టింది.
ఇక ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తీవ్రమైన డిజాస్టర్ ను చవిచూడడంతో దాదాపుగా రూ. 60 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ పైనే విజయ్ దేవరకొండ పైన సోషల్ మీడియాలో పలు విధాలుగా ట్రోల్స్ జరిగాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నారు.
ఇందులో హీరోయిన్గా సమంత నటిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించి షూటింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఈ చిత్రం కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే లైగర్ సినిమా ప్లాప్ కావడంతో తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా లవ్ స్టోరీ కి విజయ్ కరెక్ట్ గా సెట్ అవుతారని చిత్ర బృందం భావించడంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి సమంత అయిన విజయ్ దేవరకొండకు మంచి సక్సెస్ అందించి విజయం కాపాడుతుందేమో చూడాలి మరి. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే విజయ్ మరి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.