Dhoni: సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ధోని..!!

భారత్ క్రికెటర్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టేడియంలో అడుగు పెట్టారంటే చాలు అభిమానులు కోలహలం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఐపిఎల్ లో తన సత్తా చాటుతూ ఉన్నాడు ధోని. అయితే ఇప్పుడు తాజాగా సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఎంఎస్ ధోని ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ స్థాపించి ఇప్పటికీ మూడు చిత్రాలను నిర్మించారు. అందులో రోర్ ఆఫ్ ది లయన్, బ్లేజ్ టు గ్లోరీ , ది హిడెన్ హిందూ వంటి చిన్న చిత్రాలను ఈ బ్యానర్లు నిర్మించడం జరిగింది ధోని.

Mahendra Singh Dhoni To Produce South Indian Films Under This Banner
తన ఆట తీరుతో ఎంతోమంది కలలను నెరవేర్చారు ధోని అన్ని ఫార్మాట్లలో కూడా ఇండియా టీమ్ ను నెంబర్ వన్ గా నిలిచేలా చేశారు.తాజాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చిన ధోని తన దృష్టిని సినిమా నిర్మాణం పైన పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ధోని ఎంటర్టైన్మెంట్ సంస్థ పేరుతో పలు చిత్రాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. అలా తాజాగా సౌత్ సినిమాల పైన ధోని దృష్టి పడింది ఈ క్రమంలోని తెలుగు, తమిళ్ ,మలయాళం వంటి భాషలోని సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక ధోని తన ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎలాంటి సినిమాలను నిర్మిస్తారు ఎవరితో నిర్మిస్తారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది లెజెండ్ గా పేరు సంపాదించిన ధోని. తనతో చేతులు కలిపే నటీనటులు ఎవరు అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు ఇవన్నీ తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ధోనీకి సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారుతోంది.