రిపోర్టర్ పై కోపంతో చెలరేగిపోయిన అను ఇమ్మాన్యుయేల్..!!

మొదటిసారిగా మలయాళం సినిమాతో తన కెరియర్ను మొదలు పెట్టింది అను ఇమ్మాన్యుయేల్. ఇక తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను చిత్రంతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఈ చిత్రంతో బాగానే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఏ ఒక్కరు కూడా ఈమేకు సక్సెస్ ఇవ్వలేకపోయారు. దీంతో వరుస ఫ్లాప్ లతో సత మతమవుతున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ కూడా చాలా డౌన్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇక గత సంవత్సరం మహాసముద్రం సినిమాలో నటించిన కూడా అది కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది. తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

Anu Emmanuel is juicy like Alphonso - Cine Chit Chat
ఈ చిత్రంలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో మేకర్స్ చాలా జోరుగా ప్రమోషన్స్ ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో అల్లు శిరీష్ ,అను ఇమ్మాన్యుయేల్ పాల్గొనడం జరిగింది. అయితే ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ పైన ఈమె చాలా అసహనాన్ని వ్యక్తం చేసింది అన్నట్లుగా సమాచారం.

Anu Emmanuel Photos [HD]: Latest Images, Pictures, Stills of Anu Emmanuel -  FilmiBeat
అయితే అందుకు కారణం ఏమిటంటే అల్లు అర్జున్, అల్లు శిరీష్ పైన ఒక ప్రశ్న కారణం అన్నట్లుగా తెలుస్తోంది.. ఒక రిపోర్టర్ అల్లు అర్జున్తో సినిమా తీశారు అల్లు శిరీష్ తో సినిమా తీశారు.. ఈ ఇద్దరిలో ఎవరు నాటి..? ఎవరు క్యూటి అనే ప్రశ్న ఎదురవ్వగా.. వాస్తవానికి ఈ ప్రశ్నలు అంతా వల్గర్ ఏమీ లేదు.. కానీ ఈ ముద్దుగుమ్మకు ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ మీకు అడగడానికి వేరే ప్రశ్నలు లేవా ఎప్పుడు ఇలాంటివే అడుగుతారు. మంచి ప్రశ్నలు అడగండి అంటూ ఆ రిపోర్టర్ పైన కోప్పడినట్లుగా తెలుస్తుంది అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.