వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యాంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు స్వప్న. అవును, ఈమె ‘రాముయిజం’ పేరుతో వర్మతో పలు ఎపిసోడ్స్ చేసిన కారణంగా ఆ పేరు వచ్చింది. ఇకపోతే టీవీ యాంకర్, సింగర్, నటి అయినటువంటి స్వప్న తొలుత దూరదర్శన్, ఆపై టీవీ9లో యాంకర్గా, న్యూస్ ప్రెసెంటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు టీవీ 9లో పదేళ్లకు పైగా పనిచేసి.. ఆ తర్వాత సాక్షి ఛానెల్లో మారింది. అక్కడ పెద్ద స్థాయికే చేరుకుంది. ఆ తర్వతా సాక్షి నుంచి బయటకు వచ్చినా.. ఆ ఛానెల్కు కన్సల్టెంట్గా పనిచేస్తూనే ఉంది.
ఆ తరువాత 10 టీవీలో కూడా పని చేసింది స్వప్న. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూల ద్వారా బాగా ఫేమస్ అయిన స్వప్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఈవిడ పెళ్లి పీటలు ఎక్కినట్టు తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) బోర్డులో డైరెక్టర్లుగా టీవీ యాంకర్ స్వప్నని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఎస్వీబీసీ ఛైర్మన్గా పృథ్వీరాజ్ బాలిరెడ్డిని గతంలోనే నియమించిన విషయం తెలిసిందే.
ఆయనతో కలిసి స్వప్న పని చేసింది.. వాస్తవానికి ఎస్వీబీసీ బోర్డులో ఛైర్మన్తో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులను డైరెక్టర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ప్రభుత్వం ఈ సారి ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి ఇతరులకు అవకాశం కల్పించింది. ఇకపోతే స్వప్న గతంలో డైవర్స్ తీసుకోగా, ఈవిడ రీసెంట్గా ఓ డాక్టర్ని వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈవిడ గారు యూఎస్కి వెళుతున్న నేపథ్యంలో త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనుంది. కొందరు స్వప్న ఫొటోని మార్ఫింగ్ చేశారని అంటున్నారు. అసలు దీనిపై క్లారిటీ రావాలంటే స్వప్న స్పందించే వరకు ఆగాల్సిందే.