సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మణిరత్నం కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన తెరకెక్కించి ఏదైనా చిత్రాలలో మ్యాజిక్ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా రిజల్ట్ పైన ఎలాంటి సంబంధం లేకుండా మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇప్పటివరకు తెరకెక్కించారు డైరెక్టర్ మణిరత్నం. ఇప్పుడు తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్టు ఆయన పొన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా ఈ రోజున విడుదలై మంచి టాకుతో దూసుకుపోతోంది.
ఇక ఈ సినిమాని కొన్ని వేల సంవత్సరాల క్రితం చోళులా కథ అంశంతో తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని రెండు విభాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ సినిమాలో విక్రమ్, కార్తీక్, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాష్ రాజ్ తదితర నటీనటులు సైతం నటించారు. ఈ సినిమా పైన అభిమానులు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను ఈ చిత్రం అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కరికాలన్ పాత్ర లో విక్రమ్ , అరుణ్ మోళీ వర్మన్ గా జయం రవి, వల్లవరాయన్ వాందివ దేవగన్ గా కార్తీ, నందిని గా ఐశ్వర్యరాయ్, కుందవై పాత్ర లో త్రిష నటించిన అయితే ఈ చిత్రంలో హీరోలుగా ముందుగా ఇతరు నటీనట్లను అనుకున్నారట మణిరత్నం.
పొన్నియన్ సెల్వన్ సినిమాలో మహేష్ బాబు, దళపతి విజయ్ లను ఈ సినిమా కోసం ముందుగా అనుకున్నారట.. కరికాలన్ విక్రమ్ ప్లేసులో దళపతి విజయ్ ను అనుకోగా.. వల్లవరామన్ కార్తీ ప్లేస్ లో మహేష్ బాబుని తీసుకోవాలనుకున్నారట మణిరత్నం. అయితే మహేష్ విజయ్ తమ సినిమాలతో బిజీగా ఉండడం చేత ఈ కాంబినేషన్ సెట్ కాలేదని సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.
Initially #ThalapathyVijay was supposed to play as #VandiyaThevan character & #ChiyaanVikram as #AdithaKarikalan ! Writer Jeyamohan pic.twitter.com/RdUqlDpzzB
— Wαlk-Mαn Ajíth (@WalkMan_Ajith) September 8, 2022