ప్రస్తుతం ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈమె ప్రముఖ టీవీ చానల్స్ లో అదుర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మొదట ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి ఒకవైపు యాంకర్ గా మరొకవైపు పలు షో లకు హోస్ట్ గా, కొన్ని చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది శ్రీముఖి. ఇక బుల్లితెర క్వీన్ గా రాములమ్మగా పేరుపొందింది శ్రీముఖి. ఇక ప్రతిరోజు తనని తాను అప్డేట్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. శ్రీముఖి యాంకర్ గా తన కెరీయర్ని ప్రారంభించినప్పుడు మరొక మెయిల్ యాంకర్ తో కలిసి చేసేదట.
ఆ సమయంలో శ్రీముకి అంతగా పేరు డిమాండ్ కూడా లేదట. ఆ క్రమంలోని ఆ యాంకర్ తన దగ్గర తప్పుగా బిహేవ్ చేసేవారట. అంతేకాకుండా ప్రైవేట్ ఈవెంట్స్ ఉంటే రాత్రికి వస్తే డబ్బులు ఇస్తానని కూడా శ్రీముఖికి ఆఫర్ ఇచ్చేవారట దాంతో ఆమె నో చెప్పినా కూడా రమ్మని చాలా వేధించే వారట. అయితే అతడి ప్రవర్తన గురించి అంచనా వేసిన శ్రీముఖి రాను రాను ఆ యాంకర్ ను దూరం పెట్టడం మొదలుపెట్టిందట.
ఆ తర్వాత యాంకర్ శ్రీముఖి అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఆ తర్వాత తన కెరియర్లో ప్రదీప్ రవి వంటి వారితో కూడా స్టేజి పైన యాంకర్ గా చేసింది. రవితోపాటు పటాస్ షో ద్వారా ఈమె మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ వరుస ప్రోగ్రాములు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఒక్కో ప్రోగ్రాం కి రూ.2 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటోంది శ్రీముఖి.